రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ మార్కెట్ చైర్మన
అక్షరవిజేత,నేలకొండపల్లి :
నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం లో డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని తెలిపారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి కేటాయింపు చేశామని ఆయన తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఆయన అన్నారు. మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పారు.ఈకార్యక్రమంలో నాయకులు బొడ్డు బొందయ్య,మామిడి వెంకన్న,నెల్లూరి భద్రయ్య, వెంకటేష్,నిర్మలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు