చిలకలూరిపేట నారాయణ స్కూల్లో ఈ _ కిడ్జ్ వారు స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం (SLC)
చిలకలూరిపేట అక్షర విజేత
నారాయణ స్కూల్ చిలకలూరిపేట లో ఈ _ కిడ్జ్ వారు స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రుల ముందు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ జీ ఎం లక్ష్మణ్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో జెడ్ సి ఓ రేహానీ , వైస్ ప్రిన్సిపాల్ వసుంధ్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎస్ ఎల్ సి ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మాట్లాడుతూ, “ఎస్ ఎల్ సి ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ, ఆత్మవిశ్వాసం, మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు” అని చెప్పారు.
విద్యార్థులు తమ తరగతుల్లో చేసిన ప్రాజెక్టులు, మోడల్స్, అసైన్మెంట్లు మరియు క్రియేటివ్ వర్క్ను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించారు. తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించి, ప్రిన్సిపాల్ కి తమ అభిప్రాయాలు (ఫీడ్బ్యాక్) అందజేశారు.
చివరగా, ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన ఈ-కిడ్జ్ టీచర్లు మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేశార