*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం - 2025 సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రక్తద
పల్నాడు జిల్లా అక్షర విజేత
రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ వారు మరియు ప్రభుత్వ వైద్యశాల (లింగంగుంట్ల) వైద్యుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని చేపట్టినారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం - 2025 సందర్భంగా ప్రజా రక్షణ కొరకు వారు చేసిన త్యాగాలకు గుర్తుగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.
*రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడంతో సమానం కావున ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు
ప్రజా రక్షణకై అసాంఘిక శక్తులు అణచివేతలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైనారు.
ఆ పోలీస్ అమరవీరుల నాటి త్యాగాల ఫలితమే నేడు మనం సంతోషంగా ఉంటున్నాము.
ఆ పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అనేది మనం వారికి ఇస్తున్న నివాళి అని తెలిపారు.
ప్రజల ధన,మానాల తో పాటు వారి ప్రాణాలను కాపాడటానికి పోలీస్ వారు ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఈ పోలీస్ రక్తదాన శిబిరం ఒక ఉదాహరణ అని తెలిపారు.
ఈ రోజు రక్తదానం చేసిన పోలీస్ వారికి,యువతకు అభినందనలు. ఇంకా యువత, ప్రజలు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు.
సమాజ హితం కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వారు అందిస్తున్న తోడ్పాటు ఎంతో ప్రశంసనీయం అని,వారికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
ఈ రక్తదాన శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసిన ఏఆర్ డి యస్ పి జి.మహాత్మా గాంధీ ,వెల్ఫేర్ ఆర్ ఐ ఎల్.గోపినాథ్ , ఏఎన్ఎస్ ఆర్ ఐ యువరాజ్ ని, ఎం టి ఆర్ ఐ కృష్ణ ,అడ్మిన్ ఆర్ ఐ యం.రాజా ని అభినందించారు.