*శ్రీకృష్ణుడికి లేని కుల వివక్ష మీకెందుకు..!?* *ఎమ్మార్పీఎస్ అధినేత డాక్టర్ మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు*.
అక్షర విజేత షాద్నగర్.
మా మాదిగ జాతికి చెందిన జాంబవంతుడి కూతురును శ్రీకృష్ణుడు వివాహమాడలేదా..?
*ఎల్లంపల్లిలో మాదిగ బిడ్డను హత్య చేసింది యాదవుడే కదా..!*
*లోకంలో ఇదేం ధర్మమని ప్రశ్నించిన "మందకృష్ణ మాదిగ"*
*అందరూ సమానమేనని హిందూ ధర్మ రక్షకులు ముందుకు రండి*
*కుల మత వివక్షలేని రాజ్యాన్ని స్థాపిద్దాం*
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల వివక్ష రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలి*
*కరోనా కంటే ప్రమాదకర కుల వ్యవస్థను నిర్మూలించాలి*
*ఎర్ర రాజశేఖర్ బెయిల్ రాకూడదు.. జైల్లో ఉన్నప్పుడే పూర్తి విచారణ సాగాలి*
*పోలీసు, రెవెన్యూ, ఎస్సీ కమిషన్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి*
*ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించిన మందకృష్ణ మాదిగ*
*ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ - స్థానిక అధికారులతో ఫోన్లో సంప్రదింపులు*
హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు వివాహమాడింది తమ మాదిగ జాతికి చెందిన జాంబవంతుడు కుమార్తె జాంబవతి అని ఆ దేవుడికి లేని వివక్ష యాదవుడికి ఎందుకని ? ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల దళితుడు ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు గురైన సందర్భంగా సోమవారం ఎర్ర రాజశేఖర్ దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్ర రాజశేఖర్ సతీమణి ఎర్రవాణి, అతడి తండ్రి ఎర్ర మల్లేష్ తదితరు కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు దారి తీసిన విషయాలను వారి నుండి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక మీడియాతో మందకృష్ణ మాదిగ మాట్లాడారు.
హిందువులు పూజించే శ్రీకృష్ణుడు, యాదవులకు ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడు ఆనాడు తమ జాతికి చెందిన జాంబవంతుడు కుమార్తె జాంబవతిని వివాహమాడారని ఆయనకు లేని కుల వివక్ష ఇక్కడ యాదవులకు ఎందుకని ? మందకృష్ణ మాదిగ అన్నారు. ఎల్లంపల్లి గ్రామంలో దళితుడు ఎర్ర రాజశేఖర్ సోదరుడు యాదవ యువతిని ప్రేమించిన కారణంగా ఆ యువతి తండ్రి వెంకటేష్ ఒక యాదవుడని అతనికి తమ దైవం శ్రీకృష్ణ భగవానుడు గురించి తీయలేదని ప్రశ్నించారు. భగవంతుడే కులాలను విశ్వసించకుండా వివాహమాడినప్పుడు అప్పుడు యాదవ వంశ పెద్దలకు లేని వివక్ష ఇక్కడ సమాజంలో కుల వివక్ష ఎందుకు వచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో పెట్రేగిపోతున్న కుల వివక్షను రూపుమాపడానికి హిందూ ధర్మ రక్షకులు, సనాతన ధర్మాన్ని కాపాడే వారు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భగవంతుడు సమాజంలో కుల మతాలకు అతీతంగా అందరిని సమానంగా చూడమని బోధించాడని మరి హిందూమతంలోని ఇలాంటి వివక్షలు పెరిగి చంపేందుకు కారణం అవుతుంటే వీటిపై మాట్లాడడానికి హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందని సూచించారు. కుల వివక్ష కరోనా కంటే ప్రమాదకరమైనదని, కరోనా ను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ మహమ్మారిని పారద్రోలు ఎందుకు ఇలాంటి ప్రచార చర్యలు తీసుకున్నారు ప్రత్యేక నిధులు కేటాయించారు కుల వివక్షను కూడా రూపుమాపేందుకు అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల వివక్ష వెంటనే పోదని కాకపోతే రాబోయే భవిష్యత్తులో కచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. అతడు ఎర్ర రాజశేఖర్ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. అయితే వారికి తొందరగా బెయిల్ రాకుండా జాగ్రత్తలు పోలీసులు తీసుకోవాలని సూచించారు. నిందితులు జైల్లో ఉన్నప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడే విధంగా ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కమిషన్ వెంటనే స్పందించి రాజశేఖర్ కుటుంబానికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇల్లు ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా పోలీసు శాఖ అధికారులతో పాటు స్థానిక ఆర్డిఓ, ఎమ్మార్వో సరితతో ఫోన్లో మాట్లాడి బాధితులకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహకారాన్ని అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మిగతా హత్య కేసులతో పార్టీ ఈ కేసును ప్రభుత్వం చూడకూడదని పరోహత్యను ప్రత్యేకంగా చూసి ఇందులో కఠినతరమైన చట్టాలను అమలు చేసి బాధితులకు శిక్ష పడితేనే సమాజంలో మార్పు వస్తుందని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.
దేశంలో జరుగుతున్న మతాల ఘర్షణలో చనిపోయే వారి సంఖ్య అదే విధంగా రాజకీయ హత్యలు వీటన్నింటి కంటే కుల వివక్షతో జరిగే హత్యలే ఎక్కువగా ఉన్నాయని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. మందకృష్ణ వెంట రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పెంటనోళ్ళ నరసింహ మాదిగ, కాంగ్రెస్ దళిత విభాగం నాయకులు జంగారు రవి, బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు..