పాలిటెక్నిక్ వసతి గృహ నిర్మాణాలకు రూ .13.15 కోట్లు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ. రూ .13.15 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ సర్కార్. జీవో ఆర్ ట
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.విద్యాపత్తిగా పేరెన్నిక గన్న వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల కు సంబంధించి బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ . రూ 13.15 కోట్లు మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలు పెంచి ఇవ్వడంతో పాటు, ప్రతి విద్యాలయానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తూ వస్తుంది ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ క్రమంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో గల వసతి గృహానికి సంబంధించి బాలుర బాలికల నూతన వసతి గృహాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందన్నారు ఈ నిధుల మంజూరు కి సహకరించిన ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ కి, జిల్లా మంత్రిజూపల్లి కృష్ణారావు గారికి, వాకిటి శ్రీహరి గారికి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు*_