*ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన మంకు నాగరాజు అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన పంబాల నందిని (19), మంకు నాగరాజు (22) ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా సోమవారం నందిని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. దీంతో మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు బంధువులు కలిసి మంచాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా నందిని మృతి చెందిన విషయం తెలుసుకున్న నాగరాజు ఆరుట్ల నుండి వెళ్లి ఆగపల్లి గ్రామంలోని తన అక్క వద్ద ఉన్నాడు. మనస్థాపానికి గురైన నాగరాజు ఆగపల్లీ నుండి పెత్తుళ్ల గ్రామం వెళ్ళే రోడ్ లో ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.