అడిగిన వెంటనే బోర్ వేయించిన ఆడే గజేందర్. బోర్ వేయించిన ఆడే గజేందర్ కి కాలనీ వాసులు సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అక్షర విజేత: ఆదిలాబాద్ జిల్లా బ్యూరో:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పోచ్చెర గ్రామంలో రాంనగర్ కాలనీ వాసులు నీటి సమస్య ఉందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి, బోర్ వేయించి, వారి నీటి సమస్యను తీర్చినందుకు కాలనీవాసులు ఆడే గజేందర్ కి శాలువాతో సన్మానించారు. మరియు కాలనీ వాసులతో కలిసి నూతన బోర్ ను బటన్ వేసి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఏ సమస్య ఉన్న, తన దృష్టికి తీసుకొస్తే, సమస్యలు పరిష్కరించే, విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. వారి వెంట నాయకులు ,కార్యకర్తలు, ఉన్నారు.