*జె యం జె పాఠశాల విద్యార్థినిల క్రీడల ప్రతిభ*
అక్షర విజేత మాసాయిపేట
ప్రజ్ఞాపూర్ లో జరిగిన యస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లాల నెట్ బాల్ ఎలక్షన్లో మనోహరాబాద్ మండలంలోని జె యం జె పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అండర్ 14 విభాగంలో మొక్ష శ్రీ
మరియు అండర్ 17 విభాగంలో ఏ చైత్ర రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ కే అనిత సిస్టర్ తెలిపారు.విద్యార్థుల ఎంపికపై మండల ఎంఈఓ మల్లేశం గుప్తా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రీడల పట్ల మంచి ప్రోత్సాహం అందిస్తున్న ప్రిన్సిపాల్ కి, పి ఈ టి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . వీరి ఎంపిక పై పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.