కుమ్మరి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన భీమ్ భరత్ * కుమ్మరి గూడ గ్రామంలో గుడిసె యాదయ్య నూతన శ్రీ లక్ష్మీ నరసింహ రియల్ ఎస్టేట్ ఆఫీసు న
అక్షర విజేత, చేవెళ్ల.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం కుమ్మరి గూడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధి దారులకు చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ నియామక పత్రాలు ఇచ్చి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించింది. కాగా ఈ విడతలో సొంత జాగా ఉన్నవారికే ఇండ్లను కేటాయిస్తోంది అని తెలియజేశారు.
మరియు ఎస్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి అదనంగా రూ. లక్ష సాయం అందించనున్నట్లు తెలిపారు. అంటే బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు సాయంగా అందిస్తుంటే, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ. 6 లక్షలు సాయం అందించనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల హమీల్లోనూ ఈ వాగ్ధానం చేసింది. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునేందుకు ఎస్టీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు, ఇతరులకు రూ. 5 లక్షలు సాయంగా అందిస్తామన్నారు ఇప్పుడు అందుకు అనుగుణంగానే హామీని అమలు చేస్తోంది అని కొనియాడారు.
ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మహిళల పేరు మీదే అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగున్నట్లే అని పేర్కొన్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద మంజూరు చేసినట్టు తెలిపారు
ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న షాబాద్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, షాబాద్ మండల మాజీ సర్పంచ్ తమ్మాలి రవీందర్, షాబాద్ ఎంపీటీసీ అశోక్,షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్,మన్మరి మాజీ సర్పంచ్ సత్యనారాయణ,నర్సిములు, నవీన్, ఆనంద్, వెంకటేష్, రవీందర్ రెడ్డి, సమీర్ పాషా,లక్ష్మి నారీ,మల్లయ్య, నరేష్, మల్లారెడ్డి, గుల అనంత్తయ్య, పెద్దేటి మహేందర్,
ఆయా గ్రామా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుడిసె రంగయ్య, గ్రామ ప్రజలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.